© 2026 nimisham.in

భారత నావికాదళం సముద్రంలో తన సార్వభౌమత్వాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు సరికొత్త రక్షణ వ్యూహాలకు పదును పెడుతోంది.
ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ల పాత్ర ఎంత కీలకమో ఎర్రసముద్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలకు స్పష్టంగా చూపించాయి.ఈ నేపథ్యంలో శత్రువు ఊహించని రీతిలో, సముద్రం మీది యుద్దనౌకల నుంచే ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న ఆత్మాహుతి డ్రోన్ల కొనుగోలుకు భారత నేవీ రంగం సిద్ధం చేస్తోంది. శత్రుదేశాల తీరప్రాంత క్షిపణి వ్యవస్థల కంటికి చిక్కకుండా, మన యుద్ధనౌకలు సురక్షిత దూరంలో ఉంటూనే వ్యూహాత్మక దాడులు చేయడానికి ఈ సాంకేతికత అద్భుతంగా తోడ్పడనుంది.గగనతలంలో నిఘా పెట్టి నాశనం చేసే సాంకేతికత!ఈ ప్రత్యేక డ్రోన్లు గాల్లోకి ఎగిరిన తర్వాత దాదాపు 9 గంటల పాటు నిరంతరాయంగా పహారా కాయగలవు. శత్రువు స్థావరాన్ని గుర్తించగానే గంటకు 200 నాట్ల వేగంతో విరుచుకుపడతాయి. పగటితో పాటు చీకట్లోనూ ఖచ్చితమైన లక్ష్యాలను గుర్తించేలా ఎలక్ట్రో-ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లను వీటిలో అమర్చనున్నారు. సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ అనుకున్న టార్గెట్‌ను నేలమట్టం చేసే అద్భుతమైన సామర్థ్యం వీటి సొంతం. అంతేకాదు, శత్రువులు ఒకవేళ శాటిలైట్ సిగ్నళ్లను జామింగ్ చేసినా తమ పనిని విజయవంతంగా ముగించే అధునాతన నావిగేషన్ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.నౌకాదళంలోకి మచిలీపట్నం! ఆంధ్రప్రదేశ్ పేరుతో సముద్రంలో సైలెంట్ కిల్లర్..ఒకే ఆపరేటర్.. ఒకేసారి 10 డ్రోన్ల నియంత్రణ!ఈ విప్లవాత్మక సాంకేతికత ద్వారా యుద్ధనౌకపై ఉన్న ఒక్క డిజిటల్ ఆపరేటర్ ఏకకాలంలో 10 డ్రోన్లను కంట్రోల్ చేసే వీలుంటుంది. అవసరాన్ని బట్టి ఈ డ్రోన్ల కంట్రోల్‌ను మరో నావికాదళ నౌకకు లేదా తీరంలో ఉన్న ల్యాండ్ స్టేషన్‌కు సులభంగా బదిలీ చేయవచ్చు. అత్యంత తీవ్రమైన గాలులు అంటే గంటకు 50 నాట్ల వేగంతో గాలి వీచినా, 95 శాతం తేమ ఉన్న కఠిన సముద్ర వాతావరణాన్ని తట్టుకుని ఇవి పనిచేస్తాయి. ఈ సిస్టమ్ యొక్క కీలక విడిభాగాలకు కనీసం 10 నుంచి 20 సంవత్సరాల జీవితకాల హామీ ఉండాలని రక్షణ శాఖ ప్రాథమిక నిబంధన విధించింది.INS Malvan: ఛత్రపతి శివాజీ పులిగోరుతో యుద్ధనౌక.. సముద్ర గర్భంలో శత్రువుల వేట.మేక్ ఇన్ ఇండియాకే తొలిపీట!ఈ మరణాయుధాల తయారీని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇస్తోంది. బై ఇండియన్ - IDDM వర్గం కింద భారతీయ సంస్థల నుంచే వీటిని సేకరించనున్నారు. దీనివల్ల సాంకేతికత, మేధో సంపత్తి హక్కులు పూర్తిగా మన దేశంలోనే ఉంటాయి. భవిష్యత్తులో రాబోయే యుద్ధాల్లో సుదూర ప్రాంతాల నుంచి దాడులు చేసే అటానమస్ డ్రోన్ ప్లాట్‌ఫామ్‌లే కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్న త్రివిధ దళాలు, ఈ దిశగా భారత్‌ను రక్షణ రంగంలో సరికొత్త శక్త్యవతారంగా తీర్చిదిద్దుతున్నాయి.