
తస్సాదియ్యా.. ఈ చికెన్ ఖలేజా మసాలా ముందు ఏ కర్రీ అయినా తక్కువే
ఈ వంటకాన్ని మసాలా అన్నం, చపాతీ, రోటీ లేదా నీర్ దోసతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. అయితే ఖలేజా గట్టిపడకుండా వండటం చాలా ముఖ్యం. అందుకోసం ముందుగా అధిక మంటపై కొద్దిసేపు వేయించి, ఆ తర్వాత తక్కువ మంటపై మూత పెట్టి ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికిస్తే ఖలేజా గట్టిగా మారుతుందని రెసిపీలో ప్రత్యేకంగా సూచించారు. ముందుగా చికెన్ ఖలేజాను బాగా శుభ్రం చేయాలి. అందులోని నీరు పూర్తిగా పోయేలా తుడిచి, మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత టమాటా, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మసాలా బాగా ఉడికే వరకు కలుపుతూ ఉంచాలి. నూనె పైకి తేలినప్పుడు మసాలా సిద్ధమైనట్లు. ఇప్పుడు ఖలేజా ముక్కలు, ఉప్పు వేసి అధిక మంటపై 3–4 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత మంట తగ్గించి మూత పెట్టి 8–10 నిమిషాలు ఉడికించాలి. ఖలేజాను ఎక్కువసేపు ఉడికించకూడదు. అలా చేస్తే అది గట్టిగా మారుతుంది. ఖలేజా ఉడికిన తర్వాత గరం మసాలా వేసి మరో 2–3 నిమిషాలు వేయించాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే.. నోరూరించే చికెన్ ఖలేజా మసాలా సిద్ధం. వేడి వేడి చికెన్ ఖలేజా మసాలాను నెయ్యి అన్నం, చపాతీ, రోటీ లేదా నీర్ దోసతో వడ్డించవచ్చు. చివర్లో కొద్దిగా కసూరి మెంతులు జోడిస్తే రుచి మరింత పెరుగుతుందని రెసిపీలో పేర్కొన్నారు





















